KKD: జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈ నెల 17న 656 ఉద్యోగాలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి జి. శ్రీనివాసరావు తెలిపారు. పలు ప్రయివేట్ సంస్థల్లో ఉద్యోగాలకు ఎంపిక జరుగుతుందన్నారు. 18 నుంచి 35 ఏళ్ల వయసున్న, టెన్త్ నుంచి డిగ్రీ వరకు చదివిన అభ్యర్థులు ధ్రువపత్రాలతో ఆ రోజు ఉదయం 10 గంటలకు హాజరుకావాలని సూచించారు.