AKP: మాకవరపాలెం మండలం కొండల అగ్రహారం గ్రామంలో జరుగుతున్న ఎర్ర చెరువు పనులను డూమా పీడీ నిర్మలదేవి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ముఖ ఆధారిత హాజరులో ఎదురవుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఉదయం 5 గంటలకే పనులు ప్రారంభించి 10 గంటలకు ముగించాలన్నారు. అలాగే, పని ప్రదేశంలో తాగునీటి సౌకర్యం కల్పించాలన్నారు.