KDP: రైతులు ఇచ్చిన శెనగలకు 15 రోజులలోపే డబ్బులు వారి బ్యాంక్ ఖాతాల్లో జమవుతాయని DM. ప్రమీల దేవి తెలిపారు. శనివారం లింగాల మండలంలో కొనుగోలు కేంద్రాన్ని బిజినెస్ మేనేజర్ ఖాదరవల్లి కలిసి పరిశీలించారు. రైతులు తెచ్చిన శనగల నాణ్యత, తూకాల విధానం, మూటలకు ట్యాగులు సక్రమంగా వేస్తున్నారా.. అనే అంశాలను పరిశీలించారు. రైతులు దళారులకు శెనగలు విక్రయించి మోసపోవద్దని తెలిపారు.