బాపట్ల పట్టణంలో డ్రైనేజీల్లో పేరుకుపోయిన మురుగును వెంటనే తొలగించాలని కమిషనర్ రఘునాథరెడ్డి సూచించారు. గురువారం పలు ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిని పరిశీలించారు. అంబేద్కర్ భవన్ రోడ్డులో పేరుకుపోయిన మురుగుపై వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నీటి ప్రవాహం ఎప్పుడూ నిరాటంకంగా ఉండేలా సిబ్బందికి సూచించారు.