SS: అగళి మండలంలోని శంకర లింగేశ్వర స్వామి ఆలయంలో వినాయకుడి విగ్రహం చోరీకి గురైన ఘటనపై ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఆవేదన వ్యక్తం చేశారు. మండల కన్వీనర్లు, సింగిల్ విండో ప్రెసిడెంట్, పోలీసు అధికారులతో కలిసి ఆలయాన్ని సందర్శించారు. నిందితులను త్వరగా పట్టుకోవాలని పోలీసులను ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.