MBNR: బాలానగర్ మండలం వీరన్నపల్లిలో శనివారం రాత్రి మహబూబ్ నగర్ సురక్ష పోలీస్ బృందం ఆధ్వర్యంలో ‘ప్రజాభద్రత-పోలీస్ బాధ్యత’ కార్యక్రమం నిర్వహించారు. ఎస్సై లెనిన్ మాట్లాడుతూ.. వర్గ పోరు సమాజ అభివృద్ధికి ఆటంకమని, అసాంఘిక శక్తుల పట్ల పోలీసులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటారని పేర్కొన్నారు. అనంతరం బాల్య వివాహాలు, సైబర్ నేరాలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు.