GNTR: తెనాలి బోసురోడ్డులోని శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో గురువారం ఉగాది వేడుకలు భక్తిశ్రద్ధలతో జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన సహస్ర గళ హనుమాన్ చాలీసా పారాయణంలో వందలాది మంది భక్తులు ఏకకాలంలో పాల్గొని స్వామిని స్మరించుకున్నారు. అనంతరం శ్రీ ములుకుట్ల విశ్వనాథ శర్మ నిర్వహించిన పంచాంగ శ్రవణాన్ని భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆసక్తిగా వీక్షించారు.