కోనసీమ: బీజేపీ జిల్లా మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శిగా అమలాపురంకు చెందిన కొండేటి జయలక్ష్మి నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆమెను బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లా పవన్ కుమార్ ఆయన నివాసంలో ఆదివారం శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లాలో మహిళా మోర్చా మరింత బలోపేతం అయ్యేందుకు కృషి చేయాలని నల్లా పవన్ ఆమెకు సూచించారు.