PPM : CMRF ద్వారా ప్రజలకు సకాలంలో ఆర్థిక సహాయం అందించేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తోందని మంత్రి గుమ్ముడి సంద్యారాణి పేర్కొన్నారు. బుధవారం సాలూరు పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో CMRF నుంచి మంజూరైన రూ. 9,87,512 విలువైన 11 చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం మాట్లాడుతూ పేదలకు అండగా సీఎం సహాయనిధి ఉందని స్పష్టం చేశారు.