KDP: మైదుకూరు మండలం ఎర్ర చెరువులో హరిస్వర్ అనే ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య పాల్పడ్డ ఘటన ఇవాళ జరిగింది. ఇంటర్ ఫలితాల్లో ఫెయిల్ కావడంతో చెరువులో దూకినట్లు సమాచారం. మత్స్యకారులు శవాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడు నిన్న మధ్యాహ్నం ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.