CTR: పెనుమూరు మండలంలో ఓ యువకుడు గురువారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల వివరాల మేరకు.. గుట్టకింద పల్లికి చెందిన రవి కుమారుడు దిలీప్ (26) గతంలో యాక్సిడెంట్ జరిగింది. దవడ గాయమై కోలుకోలేకపోతున్నాడు. ఇటీవల వ్యాపారాలు చేస్తే నష్టపోయాడు. ఈక్రమంలో జీవితంపై విరక్తి చెంది అమ్మమ్మ ఊరైన అట్టలవారిపల్లిలో ఉరేసుకున్నాడు.ఎస్ఐ శ్రీనివాసులు కేసు నమోదు చేశారు.