అల్లూరి: కొయ్యూరు మండలం బంగారమ్మపేట జంక్షన్ వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యూ.చీడిపాలెం, మఠం భీమవరం పంచాయతీ అభివృద్ధి అధికారులు మోహనకృష్ణ, సత్యనారాయణ గాయపడ్డారు. వారు బైక్పై కేడీపేట వెళుతుండగా, గేదెలు అడ్డు రావడంతో ప్రమాదం జరిగింది. అటుగా వెళ్తున్న జిల్లా పంచాయతీ అధికారి కేపీ చంద్రశేఖర్ ప్రమాదాన్ని గమనించారు. వారికి సపర్యలు అందించి, ఆసుపత్రికి తరలించారు.