SKLM: టెక్కలి మండలం బూరగాం గ్రామంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పిల్లలను చేర్పించాలని ఇంటింటా ప్రచారాన్ని ప్రధానోపాధ్యాయులు పి.హరిప్రసన్న గురువారం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య లభిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సిబ్బంది ఉమేష్ కుమార్, రోజా, వనజాక్షి, అలి వేణి, మాణిక్యం, తదితరులు పాల్గొన్నారు.