కాకినాడ GGHలో సెక్యూరిటీ గార్డుల దౌర్జన్యం శృతిమించింది. శుక్రవారం గార్డులు 2వర్గాలుగా విడిపోయి బాహాబాహీకి దిగడంతో పలువురు గాయపడి ఆసుపత్రి పాలయ్యారు. వీరి ఆగడాలపై సూపరింటెండెంట్కు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని బాధితులు వాపోతున్నారు. ఆసుపత్రి ఛైర్మన్ హోదాలో కలెక్టర్ తక్షణమే స్పందించి, సెక్యూరిటీ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.