సత్యసాయి: కదిరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను గురువారం పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గ సమన్వయకర్త బీఎస్ మక్బూల్ ఆధ్వర్యంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాల సాధనే లక్ష్యంగా పార్టీ స్థాపించబడిందని, కార్యకర్తలే పార్టీకి బలమని పేర్కొన్నారు.