కాకినాడ జిల్లా ఉపాధి కార్యాలయంలో సోమవారం ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు ఉపాధి అధికారి జి. శ్రీనివాసరావు తెలిపారు. ఉదయం10:30 గంటలకు జరిగే మేళాలో ప్రముఖ కంపెనీల్లో పనిచేసేందుకు పది, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా చదివిన 45 ఏళ్ల లోపు వయసు గల స్త్రీ, పురుష అభ్యర్థులు అర్హులని చెప్పారు. అర్హత కలిగిన అభ్యర్థులు ధ్రువపత్రాలను తీసుకొని సకాలంలో హాజరుకావాలని సూచించారు.