BPT: అద్దంకి ఏకలవ్య నగర్కు చెందిన ST మహిళలు తాకట్టు పెట్టిన బంగారం విషయంలో మోసం జరిగిందని ఆరోపించారు. స్థానిక వ్యాపారి రామాంజనేయులు బంగారం తిరిగి ఇవ్వకుండా బెదిరిస్తున్నాడని సోమవారం ఒంగోలు కలెక్టరేట్లో ఫిర్యాదు చేశారు. అతనిపై SC, ST అట్రాసిటీ కేసు నమోదు చేసి బాధితులకు న్యాయం చేయాలని KVPS జిల్లా కార్యదర్శి రఘురామ్ డిమాండ్ చేశారు.