ELR: ప్రజల శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎవ్వరిని ఉపేక్షించమని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మంగళవారం స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ప్రజల ప్రశాంత జీవితాన్ని చూసి ఓర్వలేక ఉద్దేశ్య పూర్వకంగానే కొందరు గ్రామాల్లో గొడవలు సృష్టిస్తున్నారన్నారు. అటువంటి వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు చేపట్టాలని సూచించారు.