SKLM: నరసన్నపేట స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం డా.బి.ఆర్.అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైస్ ప్రిన్సిపాల్ డా.శాంతి హేమ్ మాట్లాడుతూ.. అంబేద్కర్ గారి ఆలోచనలు సమాజానికి మార్గదర్శకమని పేర్కొన్నారు. సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన సేవలను విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు.