NDL: కొలిమిగుండ్ల మండలం తుమ్మలపెంట గ్రామంలో ఇవాళ మెట్ల సువర్ణ అనే మహిళపై శేఖర్ అతని భార్య కుమారుడు ముగ్గురు కలిసి దాడి చేసినట్లు స్థానికులు పేర్కొన్నారు. దాడిలో మెట్ల సువర్ణకు గాయాలు కావడంతో చికిత్స కోసం బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. బాధితురాలు సువర్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు శేఖర్ అతని భార్య కుమారునిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రమేష్ బాబు తెలిపారు.