SKLM : జాతీయ పింఛనదారుల దినోత్సవం సందర్భంగా ఈ నెల 17న ఆమదాలవలస పట్టణంలో ఏర్పాటు చేయనున్న పింఛన్దారుల సమావేశాన్ని విజయవంతం చేయాలని విశ్రాంతి ఉద్యోగ సంఘం అధ్యక్షులు సురవరపు సిమ్మినాయుడు అన్నారు. ఈ సమావేశంలో పింఛన్దారుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. కావున ఈ విషయాన్ని గమనించి అంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు.