SKLM: సోంపేట నియోజకవర్గంలో ఆదివారం పైడిగం హెడ్ ఛానల్ను రైతు ప్రతినిధులు పరిశీలించారు. ఇటీవల తుఫాన్లతో కాలువ దెబ్బతిని, శిధిలావస్థకు చేరిందని వారు అన్నారు. రూ.36 కోట్ల అంచనా ఉన్నా ప్రభుత్వం నిధులు కేటాయించలేదని విమర్శించారు. కంచిలి, మందస, సోంపేట మండలాల రైతులకు ఇది కీలకమైన కాలువ అని, వెంటనే మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు.