NTR: విజయవాడలో జేసీ ఇలాక్కియాకి వైసీపీ నాయకులు పలు అంశాలపై వినతిపత్రం అందజేశారు. ఏ.కొండూరు, మార్కాపురం ప్రాంతాల్లో సీకేడీ తీవ్రత పెరుగుతోందని తెలిపారు. ఏ.కొండూరులో 61.8% మంది బాధితులని, మార్కాపురంలో డయాలసిస్ రోగులు పెరిగారని చెప్పారు. మెడికల్ కాలేజీ పనులు వేగవంతం చేయాలని, ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించాలని, తాగునీటి వనరులపై శాస్త్రీయ పరిశీలన చేయాలని కోరారు.