CTR: జిల్లాలోని ఏపీ మోడల్ స్కూల్లో ఆరవ తరగతి ప్రవేశానికి ఇవాళ ఎంట్రన్స్ ఎగ్జామ్ నిర్వహిస్తున్నట్లు డీఈవో రాజేంద్రప్రసాద్ తెలిపారు. ఇందుకోసం మొత్తం 7 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు నిర్దేశించిన సమయాన్ని కంటే అర్దగంట ముందుగా చేరుకోవాలని చెప్పారు. పరీక్షా కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.