PLD: పేద ప్రజల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. శనివారం రాజుపాలెం మండలం కొండమోడు వీరమ్మ కాలనీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం వారు ఇంటింటికీ వెళ్లి వృద్ధులకు, దివ్యాంగులకు పెన్షన్ దారులకు డబ్బు అందజేశారు.