CTR: కరెంట్ షాక్తో వ్యక్తి మృతి చెందిన ఘటన గుడిపల్లె సబ్ స్టేషన్లో చోటు చేసుకుంది. పూర్తి వివరాలు.. అన్నమయ్య జిల్లా చౌడేపల్లి గ్రామానికి చెందిన రెడ్డప్ప(43) కాంట్రాక్ట్ ఉద్యోగిగా సబ్ స్టేషన్లో షిఫ్ట్ ఆపరేటర్గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం సాయంత్రం సబ్ స్టేషన్లో విద్యుత్ షిఫ్ట్ మార్చే క్రమంలో షాక్ తగిలి చనిపోయాడు.