కృష్ణా: గుద్లవల్లేరు గ్రామంలో ఇంటింటికి డస్ట్ బిన్స్ పంపిణీ కార్యక్రమాన్ని పంచాయతీ అధికారులు శుక్రవారం చేపట్టారు. శానిటరీ ఇన్స్పెక్టర్ పవన్ కుమార్ మాట్లాడుతూ.. ఇంటి వద్దకే వేర్వేరు డస్ట్ బిన్లు అందించడం ద్వారా తడి, పొడి చెత్తలను వేర్వేరుగా సేకరించే అవకాశం ఉంటుందన్నారు. తద్వారా గ్రామం శుభ్రంగా ఉండటమే కాకుండా, వ్యర్ధాల నిర్వహణ సులభతరం అవుతుందని తెలిపారు.