కోనసీమ: అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి వారి ఆలయంలో శుక్రవారం భక్తులు చేసిన వివిధ సేవల ద్వారా రూ.1,24,341 లక్షల ఆదాయం లభించిందని ఆలయ ఈవో సత్యనారాయణ రాజు తెలిపారు. ప్రత్యేక దర్శనం ద్వారా 138 మంది స్వామివారిని దర్శించుకున్నారని, 17 ద్విచక్ర వాహనాలకు పూజలు నిర్వహించారని, 1652 మంది అన్న ప్రసాదం స్వీకరించారని అన్నారు.