NDL: నంద్యాల కలెక్టరేట్లో ఇవాళ ప్రజా సమస్యల పరిష్కార వేదిక(PGRS) కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి కలెక్టర్ జి.రాజకుమారి అర్జీలు స్వీకరించారు. PGRS అర్జీలు రీ-ఓపెన్ కాకూడదని, అధికారులు సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని ఈ సందర్భంగా కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తీక్, జిల్లాస్థాయి అధికారులు హాజరయ్యారు.