NLR: ప్రయాణికుల సౌకర్యార్థం రాపూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్లో ఏర్పాటు చేసిన RO ప్లాంట్ను ఆర్టీసీ జోనల్ ఛైర్మన్ సన్నపురెడ్డి సురేశ్ రెడ్డి గురువారం ప్రారంభించారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ఆర్టీసీ డిపోలలో చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీ అభివృద్ధిపై దృష్టి సారించిందన్నారు.