SKLM: రాష్ట్రంలో రాబోయే 3-4 రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో గురువారం ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. రైతులకు ప్రభుత్వం పూర్తి సహాయం అందిస్తుందని హామీ ఇచ్చారు.