ATP: వైసీపీ తీరు దెయ్యాలు వేదాలు వర్ణించినట్లు ఉందని ఎమ్మెల్యే బండారు శ్రావణి విమర్శించారు. మహిళల గురించి నోటికొచ్చినట్లు మాట్లాడి కించపరిచిన వాళ్లు నేడు మహిళలకు సంఘీభావంగా ర్యాలీలు చేయడం హాస్యాస్పదమని మండిపడ్డారు. వైసీపీ నేతల నుంచే మహిళలకు రక్షణ లేదని అన్నారు. గత పాలనలో మహిళలపై జరిగిన దాడులు మర్చిపోయారా? అని ప్రశ్నించారు.