SKLM: చెత్త నుండి సంపద సృష్టించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఇచ్చాపురం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బెందాళం అశోక్ అన్నారు. మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో కవిటి మండలానికి చెంది న స్వచ్చ రథాన్ని ప్రారంభించారు. ఇంటింటి నుంచి చెత్త సేకరించి సంపద తయారీ కేంద్రాలకు తరలించి స్వచ్ఛ గ్రామాలు తయారుచేయాలన్నారు.