PLD: రాజుపాలెం మండలం దేవరంపాడులోని ప్రసిద్ధ నేతి వెంకన్న స్వామి వారి రెండో శనివారం వేడుకలు నేడు ఘనంగా జరగనున్నాయి. ఈ వేడుకల కోసం దేవాదాయ శాఖ కమిటీ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. రేపు ఆలయ ప్రాంగణంలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించడంతో పాటు, భక్తులందరికీ భారీగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.