సత్యసాయి: ధర్మవరం నియోజకవర్గంలో పీ4, బంగారు కుటుంబాల ప్రాజెక్టులపై మంత్రి సత్యకుమార్ సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గంలో 6,345 బంగారు కుటుంబాలను గుర్తించగా, 3,450 కుటుంబాలను మార్గదర్శులు దత్తత తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. సంస్కృతి సేవా సంస్థ ద్వారా రూ.98 లక్షలతో సైకిళ్ల పంపిణీ, వివిధ గ్రామాల్లో ఆర్వో ప్లాంట్ల ఏర్పాటు చేసినట్లు వివరించారు.