VSP: యువతకు స్ఫూర్తినిస్తూ భారతీయ–ఆస్ట్రేలియన్ ఎండ్యూరెన్స్ అథ్లెట్ ఓం సతీజా చేపట్టిన “వన్ ఇండియా రన్” సోమవారం విశాఖ చేరుకుంది. దేశవ్యాప్తంగా 5,000 కిలోమీటర్ల పరుగు ద్వారా సమాజ సేవ, ఆరోగ్యంపై అవగాహన కల్పించడమే లక్ష్యమని ఆయన తెలిపారు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు సాగుతున్న ఈ పరుగు ద్వారా ఉదయాన్ ఫౌండేషన్ కోసం రూ.60 లక్షలు సేకరించనున్నట్లు చెప్పారు.