బాపట్ల: అద్దంకి మండలం పంగులూరు గ్రామంలో విద్యుత్ సరఫరా మెరుగుపరచేందుకు రూ.1.44 కోట్ల వ్యయంతో చేపట్టిన ఆధునీకరణ పనులు పూర్తయ్యాయి. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశాల మేరకు గ్రామంలో 570 నూతన విద్యుత్ స్తంభాలు, 5 ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసి కొత్త విద్యుత్ లైన్లు నిర్మించారు. దీంతో గ్రామంలో విద్యుత్ సరఫరా మరింత స్థిరంగా ఉండనుంది.