NLR: బుచ్చిరెడ్డిపాలెం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో నారాయణరెడ్డి గ్రామ వార్డు సచివాలయ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. విధుల నిర్వహణపై పలు సూచనలు చేశారు. సచివాలయ సిబ్బంది సమయపాలన పాటించాలని సూచించారు. ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించే విధంగా కృషి చేయాలని చెప్పారు. విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.