CTR: ప్రజా సమస్యల పరిష్కారమే వైసీపీ ధ్యేయమని జడ్పీ ఛైర్మన్ శ్రీనివాసులు తెలిపారు. వీ.కోట అంబేద్కర్ సర్కిల్లో పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవంను ఎంపీపీ యువరాజ్తో కలిసి గురువారం ఆయన నిర్వహించారు. వైయస్సార్ చిత్రపటానికి నివాళులర్పించి పార్టీ జెండాను ఆవిష్కరించారు. కేక్ కట్ చేసి అభిమానులకు పంచారు. మళ్లీ అధికారం సాధించడమే తమ లక్ష్యమన్నారు.