KKD: సామర్లకోట రైల్వే స్టేషన్లో తనిఖీలు నిర్వహించగా ఐదు కేజీల గంజాయి పట్టుబడింది. ఆర్పీఎఫ్ ఎస్సై ప్రవీణ్ కుమార్, జీఆర్పీ ఎస్సై వాసు ఆధ్వర్యంలో మంగళవారం రైళ్లలో ఆకస్మిక తనిఖీలు చేశారు. సుమారు 5కేజీల గంజాయి పట్టుబడింది. రూ.25 వేలు విలువైన గంజాయి సీజ్ చేసి జార్ఖండికి చెందిన బిట్టు కుమార్ యాదవ్ను అరెస్టు చేశారు.