SKLM: పాతపట్నం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆదివారం కొరసవాడ చేనేత కార్మికులు ఎమ్మెల్యే మామిడి గోవిందరావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వాళ్ళు కార్మికుల సమస్యలను పరిష్కరించాలని వినతిపత్రం సమర్పించారు. గత ప్రభుత్వ హయాంలో అర్హత కలిగి ఉన్న చేనేత కార్మికుల సభ్యత్వాన్ని తొలగించారని పేర్కొన్నారు. వెంటనే వారి సభ్యత్వాన్ని నమోదు చేయాలని తెలిపారు.