KRNL: ఆదోని మండలం కడితోట గ్రామానికి చెందిన శ్రీకాంత్ (20) అనారోగ్య సమస్యలతో మనస్తాపానికి గురై సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పెద్దతుంబలం SI విద్యాశ్రీ తెలిపారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.