విజయనగరం తోటపాలెంలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలను ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతి రాజు బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా అందిస్తున్న ఆహారాన్ని రుచి చూశారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి భోజన వసతులు గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందజేయలని సిబ్బందికి సూచించారు.