BPT: రేపల్లె ఆర్టీసీ డిపోను ఆర్టీసీ హౌస్ విజయవాడ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఏ.అప్పలరాజు శనివారం సందర్శించారు. అయనతో పాటు గుంటూరు డీపీటీవో ఎం.రవికాంత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్మికులను ఉద్దేశించి సమయపాలనపై మాట్లాడారు. దూరప్రాంతం వెళ్లు బస్సులు తప్పనిసరిగా సమయపాలన పాటించాలని, మధ్యలో ఉండే పికప్ పాయింటులో కొద్దిసేపు ఆపుకొని వెళ్ళుటకు అవకాశం ఉంటుందన్నారు.