కృష్ణా: నాగాయలంక మండలం ఎదురుమొండిలో నూతన విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణానికి అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఇవాళ శంకుస్థాపన చేశారు. APCPDCL ఇంప్రూవ్మెంట్ నిధులు రూ.4 కోట్లతో నిర్మించ తలపెట్టిన ఈ సబ్స్టేషన్ నిర్మాణానికి ఎమ్మెల్యే, విద్యుత్ శాఖ ఉన్నత అధికారులతో కలసి భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు.