TPT: చంద్రగిరి మూలస్థాన ఎల్లమ్మ తల్లి ఆలయంలో పూర్ణాహుతి కలశాభిషేక మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ మహోత్సవానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పులివర్తి నాని దంపతులతో కలిసి హాజరయ్యారు. దంపతులకు ఆలయ ఛైర్మన్, ఈవో, కమిటీ సభ్యులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజా కార్యక్రమాలలో పాల్గొని పూర్ణాహుతి కలశాభిషేక వేడుకల్లో పాల్గొన్నారు.