VZM: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో భూములు కోల్పోయిన కుటుంబ సభ్యులతో పాటుగా జిల్లా లోని యువతకి ఉపాధి కల్పించాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వం పై ఉందని జిల్లా పౌర వేదిక అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి అన్నారు. శుక్రవారం పౌర వేదిక కార్యాలయంలో జరిగిన ప్రజా సంఘాల రౌండ్ టెబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు.ఈ సమావేశంలో పీస్ సంస్థ అధ్యక్షుడు చంద్రశేఖర్ పాల్గొన్నారు.