అన్నమయ్య: ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న శ్రామికుల వేతన బకాయిలు చెల్లించేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.1,668 కోట్లు విడుదల చేసింది. ఈ నిధులతో మే 15 నుండి ఆగస్టు 15 వరకు చెల్లించాల్సిన బకాయిలు తీరిపోతాయని ఉన్నతాధికారులు తెలిపారు. దీంతో మిగిలిన చెల్లింపుల కోసం దాదాపు రూ.140 కోట్లు అవసరమని పేర్కొన్నారు. కాగా, ఈ నగదు నాలుగు రోజుల్లోగా శ్రామికుల ఖాతాల్లో జమ కానుంది.