సత్యసాయి: కొత్తచెరువు మండలంలో హంద్రీనీవా కాలువలో నీటి ప్రవాహానికి కొట్టుకు వచ్చిన ఒక గుర్తు తెలియని మృతదేహం శనివారం లభ్యమైంది. కాలువలో మృతదేహం తేలుతూ ఉండటాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికితీసేందుకు చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.