ELR: నాటుసారా నిర్మూలనే లక్ష్యంగా చింతలపూడి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులు శుక్రవారం నియోజకవర్గ వ్యాప్తంగా విస్తృత దాడులు నిర్వహించారు. పాత కేసుల్లోని నిందితులను మండల మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచినట్లు అధికారులు తెలిపారు. మెజిస్ట్రేట్ బైండోవర్ విధించారని, అక్రమ మద్యం తయారీ, విక్రయాలపై ఉక్కుపాదం మోపుతామని ఎక్సైజ్ అధికారులు హెచ్చరించారు.